తజకిస్థాన్ : తజికిస్థాన్లో ఆదివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 6.4 పాయింట్లుగా నమోదయ్యింది. ఈరోజు ఉదయం 9 గంటల 54 నిముషాల సమయంలో భూమి కంపించడంతో జనం భయాందోళనకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రాన్ని 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మయన్మార్లో కూడా నేడు మళ్లీ భూకంపం సంభవించింది. ఇక్కడి మీక్తిలియా ప్రాంతంలో 5.5 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు.
