ఖాట్మాండు : నేపాల్లో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.0గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఉదయం నాలుగున్నర గంటల సమయంలో నేపాల్లో భూప్రకంపనలు సంభవించాయి. వెడల్పు : 28.76, పొడవు : 82.01, 25 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు ఎన్సిఎస్ ఎక్స్ పోస్టులో పేర్కొంది. భూప్రకంపనలకు పలు భవనాలు కూలిపోయాయి. ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
