వాషింగ్టన్ : తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్కు తక్షణమే బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో మొత్తం ఆర్థిక సాయంలో భాగంగా ఇప్పటివరకు సుమారు 2.1 బిలియన్ డాలర్లు పాకిస్థాన్కు అందినట్లయింది. ఐఎంఎఫ్ నిర్ణయంపై పాకిస్థాన్ ప్రధానమంత్రి కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు, పాకిస్థాన్కు ఈ ఆర్థిక సహాయం అందించడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిధులను పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
