లాస్ ఏంజిల్స్ : అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో కఠినమైన పర్వతాలలోని మరో ప్రాంతంలో మంటలు చెలరేగాయి. వేగంగా కదులుతున్న కార్చిచ్చు వలన 50,000 మందికి పైగా ప్రజలు ఖాళీ చేయమని ఆదేశాలు జారీ చేశామని అధికారులు తెలిపారు. ఇటీవల హాలీవుడ్ తదితర ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చు అదుపులోకి రాకముందే మరోకటి మొదలు కావడం ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గురువారం తెల్లవారుజామున చెలరేగి తాజా కార్చిచ్చు 15 చదరపు మైళ్ల (39 చదరపు కిలోమీటర్లు) చెట్లు, పొదలను వేగంగా కాల్చివేసింది. ఆ ప్రాంతంలో గాలులు బలంగా విస్తున్నాయని, దీని వలన మరింతగా మంటలు చెలరేగే అవకాశం ఉందని వారు తెలిపారు. మంటలను అదుపు చేయడం కష్టంగా ఉన్నప్పటికీ అగ్నిమాపక సిబ్బంది పైచేయి సాధిస్తున్నారని కౌంటీ అగ్నిమాపక అధికారి ఆంథోనీ మర్రోన్ తెలిపారు. గాలితో నడిచే మంటలు అంతర్రాష్ట్రాన్ని దాటకుండా, కాస్టాయిక్ వైపు ముందుకు సాగకుండా ఆపడానికి గ్రౌండ్ సిబ్బంది, నీటి బాంబులు వేసే విమానం పనిచేస్తున్నాయని తెలిపారు.
Yet another fire has suddenly broken out in LA County. 500 acres. 0% contained.
— End Wokeness (@EndWokeness) January 22, 2025