సనా : సనా విమానాశ్రయంపై ఇజ్రాయిల్ అమానుష దాడులతో 500 మిలియన్ డాలర్లు (రూ.50 కోట్లు) నష్టం వాటిల్లిందని యెమెన్ తెలిపింది. విమానాశ్రయ జనరల్ డైరెక్టర్ ఖలీద్ అల్ షైఫ్ బుధవారం హౌతీ మీడియాతో మాట్లాడారు. శత్రువులు సనా విమానాశ్రయంలోని టెర్మినల్స్ను, అన్ని పరికరాలు మరియు డివైస్లను ధ్వంసం చేశారని అన్నారు. ఒక గిడ్డంగి కూడా పూర్తిగా నేలమట్టమైందని తెలిపారు. విమానాశ్రయానికి ”తీవ్రమైన నష్టం” వాటిల్లడంతో తదుపరి నోటీసు వచ్చే వరకు విమానాశ్రయం అన్ని విమానాలను నిలిపివేస్తున్నట్లు డైరెక్టర్ ఎక్స్లో పేర్కొన్నారు.
యెమెనియా ఎయిర్వేస్ మూడు విమానాల నష్టం వాటిల్లిందని, మొత్తం ఆరు విమానాలు ధ్వంసమయ్యాయని అన్నారు. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా తెరవడానికి యత్నిస్తున్నామని, పునరుద్ధరణకు, కార్యకలాపాలను విస్తరించేందుకు చాలా సమయం పడుతుందని అన్నారు.
