గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దురాక్రమణ దాడులు

Apr 28,2025 08:14 #Gaza attacks, #Israel Attack

గాజా : గాజాపై ఇజ్రాయిల్ దురాక్రమణ దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున జరిగిన దాడుల్లో 17 మంది పాలస్తీనియన్లు మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. గాజా స్ట్రిప్ అంతటా సుమారు 53 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. 8 వారాలుపైగా అన్ని రకాల ఆహారం, సహాయాన్ని గాజాకు అందకుండా ఇజ్రాయిల్ పూర్తిగా దిగ్బంధించింది. దీంతో అక్కడ కరువు విలయతాండవం చేస్తుంది.

➡️