కారకాస్ : రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. ఆ దేశంలో చట్టపరమైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఉంటున్న వారిపై దూకుడుగా చర్యలు చేపడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్రమ వలసదారులని పేర్కొంటూ.. భారతీయుల చేతులకు కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి ఖైదీలు మాదిరిగా వారిని యుద్ధ విమానంలో తమ స్వదేశానికి పంపారు. ఈ విధమైన చర్యనే వెనిజులావాసులపై కూడా అమెరికా పరిపాలన చర్యలు చేపట్టింది. తాజాగా చట్టపరమైన ఆధారాలు లేని వెనిజులా వలసదారుల కాళ్లకు, చేతలకు సంకెళ్లు వేసి.. మెడలు వంచి మరీ వారిని స్వదేశానికి పంపారు. ట్రంప్ పరిపాలన చర్యలపై వెనిజులా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 18వ శతాబ్దపు ఎలియన్ ఎనిమీస్ (విదేశీ శత్రువుల చట్టం) చట్టాన్ని అమలు చేస్తూ.. వందలాది మంది వెనిజులా ప్రజలను చట్టపరమైన రక్షణ లేకుండా బహిష్కరిస్తోందని మండిపడ్డారు. ట్రంప్ చర్యలకు వ్యతిరేకంగా వెనిజులా ప్రజలు ఆందోళనకు దిగారు. శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. వెనిజులా ప్రజల పట్ల వ్యవహరించిన తీరుపై ట్రెన్ డి అరగువా (వెనిజులాకు చెందిన అంతర్జాతీయ నేర సంస్థ) తీవ్రంగా ఖండించింది. టెక్సాస్లో బ్లూబోనెట్ డిటెన్షన్ సెంటర్లో న్యాయవాదులు వెనిజులా వలసదారులకు చెందిన ఫొటోలు, ఆధారాల్ని సమర్పించినప్పటికీ ట్రంప్ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించిందని, బహిష్కరణకు గురయ్యే వారికి ముందుగానే నోటిఫికేషన్ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేవాలను సైతం విస్మరించిందని, వలసదారుల హక్కుల్ని ఉల్లంఘించిందని ట్రెన్ డి అరగువా తీవ్రంగా ఆరోపించింది.
కాగా, మరోవైపు అమెరికాలో కూడా వెనిజులా వలసదారుల పట్ల చేపట్టిన చర్యను పౌర హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఎలియన్ ఎనిమీస్ యాక్ట్ 1798 (విదేశీ శత్రువుల చట్టం)ని ట్రంప్ ప్రభుత్వం పునరుద్ధరణకు ప్రయత్నిస్తోంది. ముందస్తు నోటిఫికేషన్ లేదా.. న్యాయవాదుల సలహా తీసుకోకుండా. వెనిజులా ప్రజలను బహిష్కరించడానికి ద ఎలియన్ ఎనిమీస్ యాక్ట్ని అమలు చేయడం దారుణమని ఎసిఎల్యు (డి అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్)కు లెక్కలేనన్ని ఫిర్యాదులు అందాయి.
