న్యూఢిల్లీ : ఆపరేషన్ సిందూర్ గురించి వివరించేందుకు కేంద్రం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలు హాజరయ్యారు. సమావేశానికి ముందు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్రిజిజు మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ను సాయుధ దళాలు విజయవంతంగా అమలు చేశాయి. ఇటువంటి పరిస్థితిలో మనం విభజించకూడదని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని అన్నారు. ప్రతి ఐక్య భారతీయుడు ఐక్యంగా ఉండాల్సిన పరిస్థితి ఇదని అన్నారు.
