ఉగ్రదాడిపై నేడు అఖిలపక్ష సమావేశం

ఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివిధ రాజకీయ పార్టీల నాయకులను దీని కోసం సంప్రదిస్తున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారతదేశం బుధవారం పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలను తగ్గించుకుంది. పాకిస్తాన్ మిలిటరీ అటాచ్‌లను బహిష్కరించడం, ఆరు దశాబ్దాలకు పైగా ఉన్న సింధు జల ఒప్పందాన్ని నిలిపివేసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడికి సరిహద్దు సంబంధాల దృష్ట్యా అట్టారి భూ-రవాణా పోస్టును వెంటనే మూసివేయడం వంటి చర్యలను ప్రకటించింది.

➡️