న్యూఢిల్లీ : లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్ను అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సోమవారం కొట్టివేసింది. ఈ కేసుపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యల వివరాలను సమర్పించాలని విచారణ సందర్భంగా లక్నో బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం కేసును కొట్టివేసింది.
రాహుల్ గాంధీ భారతదేశం, బ్రిటన్ పౌరసత్వాలను కలిగి ఉన్నారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 84 (ఎ) ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడంటూ కర్ణాటకకు చెందిన బిజెపి కార్యకర్త విఘ్నేష్ శిశిర్ ఈ పిల్ను దాఖలు చేశారు.
గత విచారణలో రాహుల్ గాంధీ భారతీయ పౌరుడా? కాదా అనే విషయంపై హౌం మంత్రిత్వశాఖ సమర్పించిన నివేదిక పట్ల కోర్టు అసంతఅప్తి వ్యక్తం చేసింది. రాహుల్గాంధీకి ద్వంద్వ పౌరసత్వం ఉందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై స్పష్టమైన సమాధానమివ్వాలని.. సవరించిన నివేదిక సమర్పించడానికి కోర్టు ప్రభుత్వానికి 10 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే.