నియంతృత్వానికి తండ్రిలా బిజెపి : కపిల్‌ సిబాల్‌

Apr 13,2025 23:40 #BJP, #dictatorship, #father of, #Kapil Sibal

న్యూఢిల్లీ : ప్రతిపక్షాన్ని అంతం చేసేందుకు మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోందని రాజ్యసభ ఎంపి కపిల్‌సిబాల్‌ విమర్శించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో స్థిరాస్తుల స్వాధీనం కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) నోటీసులు జారీ చేయడాన్ని రాజ్యాంగంపై దాడిగా పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి నియంతృత్వానికి తండ్రిలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి హిందూ -ముస్లిం ఎజెండాపై విభజన రాజకీయాలు చేస్తోందని, ప్రతిపక్షాలను అంతం చేయాలని చూస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌ నియంత్రిస్తున్న నేషనల్‌ హెరాల్డ్‌ న్యూస్‌పేపర్‌ అండ్‌ ది అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఎజెఎల్‌)కి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకోనున్నట్లు ఇడి శనివారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

➡️