న్యూఢిల్లీ : బిఎస్ఎఫ్ జవానును పాకిస్థాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు గురువారం ప్రకటించాయి. పంజాబ్లోని ఫిరోజ్పూర్ సమీపంలో ప్రమాదశాత్తు అంతర్జాతీయ సరిహద్దును దాటారని, బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నాయి. ఫెన్సింగ్కు సమీపంలో స్థానిక రైతులకు భద్రత కల్పిస్తున్న సమయంలో అనుకోకుడా పాకిస్థాన్ భూభాగంలోకి అడుగుపెట్టాడని తెలిపాయి. బిఎస్ఎఫ్, పాకిస్థాన్ రేంజర్స్ సీనియర్ అధికారుల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించే అంశాన్ని పరిశీలిస్తున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి.
