వీటి ధరల్లో మార్పులు
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్లో పలు ఉత్పత్తుల ధరల్లో మార్పులు జరగనున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన పన్ను మినహాయింపులు, ఎగుమతి, దిగుమతులపై సుంకాల మార్పులు పలు వస్తువుల ధరలపై ప్రభావం చూపనున్నాయి. 36 ఔషధాలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగించడం ద్వారా ఈ ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానెల్ డిస్ప్లే మీదా పన్నును 10 శాతం నుంచి 20 శాతానికి పెంచారు. దీంతో టివిల రేట్లు పెరిగే అవకాశం ఉంది.
ధరలు తగ్గేవి..
- క్యాన్సర్ మందులు
- ప్రాణాలను రక్షించే మందులు
- ఎల్సిడి, ఎల్ఇడి టివిలు
- మొబైల్ ఫోన్లు
- తోలు వస్తువులు
- వైద్య పరికరాల
- ఫ్రోజెన్ చేపలు
- చేపల పేస్ట్
- వెట్ బ్లూ లెదర్
- క్యారియర్-గ్రేడ్ ఈథర్నెట్ స్విచ్లు
- 12 కీలకమైన ఖనిజాలు
పెరిగేవి..
- అల్లికల దుస్తులపై కస్టమ్స్ పన్ను 10 నుంచి 20 శాతానిక పెంపు
- దిగుమతి చేసుకునే కొవ్వొత్తులు
- దిగుమతి చేసుకునే విలాసవంతమైన పడవలు
- పాలీవినైల్ క్లోరైడ్ (పివిసి)
- ఉత్పత్తులు
- విదేశీ చెప్పులు
- స్మార్ట్ మీటర్లు, సోలార్ బ్యాటరీలు