న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని ఏడాది పొడిగిస్తూ కేంద్రం నిర్ణయించింది. 2024 మే 25న రెండేళ్ల కాలానికి సూద్ సిబిఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా వున్న సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సెలక్షన్ కమిటీ సిఫార్సుల మేరకు కేబినెట్ అప్పాయింట్మెంట్స్ కమిటీ (ఎసిసి) సూద్ పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించేందుకు ఆమోద ముద్ర వేసింది. 1986 బ్యాచ్కు చెందిన ఐపిఎస్ అధికారి అయిన సూద్ కర్ణాటక కేడర్కు చెందినవారు. కర్ణాటక డిజిపిగా చేస్తూ సిబిఐ డైరెక్టర్గా వచ్చారు. 22 ఏళ్ల వయస్సులో ఐపిఎస్లో చేరిన సూద్ ఐఐటి ఢిల్లీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
