Chennai: తాత్కాలిక పారిశుధ్య కార్మికుల కోసం సంక్షేమ సహాయ కేంద్రాలు

Apr 24,2025 08:30 #chennai, #Tamil Nadu, #tamilnadu

చెన్నై: తాత్కాలిక పారిశుధ్య కార్మికుల కోసం సంక్షేమ సహాయ కేంద్రాలను చెన్నై మేయర్ ఆర్. ప్రియ బుధవారం ప్రారంభించారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జిసిసి)లోని 15 జోనల్ కార్యాలయాలలో తమిళనాడు పారిశుధ్య కార్మికుల సంక్షేమ బోర్డు మద్దతుతో వీటిని ఏర్పాటు చేశారు. ఈ సహాయ కేంద్రాలు అన్ని వర్గాల పారిశుధ్య కార్మికులకు సహాయం చేస్తాయి. జిసిసితో పనిచేసేవారు, నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్  వంటి సంస్థలు, సంస్థల నుండి అవుట్‌సోర్స్ చేయబడినవారికి కూడా ఈ కేంద్రాల ద్వారా సహాయం చేస్తారు. బోర్డులోని నమోదిత సభ్యులకు గుర్తింపు కార్డులు, సమాచార బుక్‌లెట్‌లను కూడా పంపిణీ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. 17,659 తాత్కాలిక కార్మికులు, సాధారణ, క్రమరహిత మురుగునీటి సంబంధిత పనులలో నిమగ్నమైన 17,627 మంది కార్మికులతో సహా మొత్తం 35,286 పారిశుధ్య కార్మికులు సంక్షేమ బోర్డు గుర్తింపు కార్డులను అందించనున్నట్లు తెలిపారు.  ఇప్పటివరకు మొత్తం 12,273 మంది కార్మికులు తమ కార్డులను అందుకున్నారని పేర్కొన్నారు. ప్రమాద బీమా, మరణం, అంత్యక్రియలు, పెన్షన్లు, వివాహం మరియు ప్రసూతి ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలకు ఈ సహాయ కేంద్రాలు సహాయం అందిస్తాయి. తమిళనాడు అర్బన్ శానిటేషన్ సపోర్ట్ ప్రోగ్రామ్ ద్వారా జిసిసి-ఉద్యోగిత పారిశుధ్య కార్మికులకు నైపుణ్య శిక్షణ, భద్రతా సామగ్రి మరియు ఇతర సహాయాన్ని అందిస్తున్నట్లు వితెలిపారు.

➡️