ఢిల్లీ ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు పున:ప్రారంభం

  • విమాన ప్రయాణికులకు కీలక సూచనలు

ఢిల్లీ : భారత్‌ -పాక్‌ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో పలు విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు కీలక ప్రకటన చేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఉదయం నుంచి కార్యకలాపాలు పున:ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అయితే, ప్రయాణికులకు పలు సూచనలు జారీ చేశారు.

ప్రయాణికులకు జారీ చేసిన సూచనలు:

  • తమ విమానాల తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు విమాన సంస్థలను సంప్రదించాలి.
  • హ్యాండ్‌ బాగేజ్‌, చెక్‌-ఇన్‌ లగేజీ నిబంధనలు పాటించాలి.
  • భద్రతా తనిఖీలకు ముందుగా సమయం కేటాయిస్తూ విమానాశ్రయానికి ముందుగానే రావాలి.
  • విమానాశ్రయం, విమాన సంస్థ సిబ్బందితో సహకరించాలి.తమ విమాన స్థితిని అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఎయిర్‌లైన్‌ అప్లికేషన్‌ ద్వారా తనిఖీ చేయాలి.
  • నిర్ధారణ లేని సమాచారాన్ని పంచుకోకుండా, అధికారిక సమాచారం మాత్రమే తెలుసుకోవాలి.
➡️