ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ నెల 27 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కస్టడీ పొడిగించారు. ఆయన కస్టడీ ముగియడంతో సిబిఐ ఆయనను మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచింది. ఈ సందర్భంగా కోర్టు కస్టడీని ఈ నెల 27 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు వెలువరించారు. ఈ నెల 14న కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ స్పందన కోరింది. కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. సిబిఐ కేసులో ట్రయల్ కోర్టు నుంచి రెగ్యులర్ బెయిల్ కోసం ఆశ్రయించాలని సూచించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న ఇడి అరెస్టు చేయగా, జూన్ 20న మనీలాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదేశాలపై హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. ఇడి దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో జులై 14న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
