రైతుల కోసం ‘ధన్‌ధాన్య కృషి యోజన’ పథకం

Feb 1,2025 12:27

న్యూఢిల్లీ : రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు బడ్జెట్‌ సందర్భంగా నిర్మలా సీతారమన్‌ ప్రకటించారు. ‘ప్రధానమంత్రి ధన్‌ధాన్య కృషి యోజన’ పథకం ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ది చేకూరనుందని ఆమె బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ప్రస్తావించారు. ప్రత్యేకించి దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ఈ పథకం ద్వారా ప్రోత్సాహం అందించనున్నట్లు ఆమె చెప్పారు. ఇందులో భాగంగానే గోడౌన్లు, నీటి పారుదల, రుణ సదుపాయాలు కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. పప్పు ధాన్యాలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం తీసుకొస్తున్నామని నిర్మలా సీతారమన్‌ చెప్పారు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకాన్ని తీసుకొచ్చామని, ఇందులో భాగంగానే కంది, మినుములు, మసూర్‌ పప్పును కొనుగోలు చేయాలని నిర్ణయించామని ఆమె అన్నారు.

➡️