రాబర్ట్‌ వాద్రాకు ఇడి సమన్లు

Apr 15,2025 11:31 #priyanka gandhi, #Robert Vadra

న్యూఢిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు తాజాగా మరోసారి సమన్లు జారీ చేశారు. హర్యానాలోని శిఖోపూర్‌ భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈ సమన్లు పంపారు. ఈ కేసులో ఏప్రిల్‌ 8వ తేదీన ఇడి మొదటిసారి సమన్లు జారీ చేసింది. అయితే ఆ సమన్లను వాద్రా దాటవేయడంతో.. ఇప్పుడు రెండోసారి సమన్లు జారీ చేసింది.
కాగా, ఫిబ్రవరి 2008లో వాద్రా కంపెనీ ఒంకారేశ్వర్‌ ప్రాపర్టీస్‌ నుంచి రూ. 7.5 కోట్లకు గుర్గావ్‌లోని శిఖోపూర్‌లో 3.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఈ భూమినే వాద్రా కంపెనీ సుమారు 58 కోట్లకు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ డీఎల్‌ఎఫ్‌కి విక్రయించింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌కి పాల్పడినటల్లు ఈడి గుర్తించింది. దీంతో ఈ కంపెనీ అధినేత రాబర్ట్‌ వాద్రాకు సమన్లు జారీ చేసి.. విచారణకు హాజురుకావాల్సిందిగా ఇడి ఆదేశించింది.

➡️