లక్నో : ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లాలో ఓ దళిత మహిళ దారుణంగా హత్యాచారానికి గురైంది. ఆ మహిళ కాళ్లు విరిచి, కంటి గుడ్లు పీకి, నగంగా ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు కాలువలో శనివారం గుర్తించారు. ఈ దారుణంపై ఫైజాబాద్ ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్ స్పందించారు. ఈ ఘటనపై ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ‘నన్ను ఢిల్లీకి వెళ్ళనివ్వండి. ప్రధాని మోడీ ముందు ఈ విషయాన్ని లోక్సభలో లేవనెత్తుతా. న్యాయం జరుగకపోతే లోక్సభ సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తా. కూతుళ్లను రక్షించడంలో మనం విఫలమవుతున్నాం. చరిత్ర మనల్ని ఎలా భావిస్తుంది? మన కూతురికి ఇది ఎలా జరిగింది? మర్యాద పురుషోత్తమ రామ.. తల్లి సీత, మీరు ఎక్కడ ఉన్నారు?’ అంటూ బోరున విలపించారు. దీంతో ఎంపీ అవధేష్ ప్రసాద్ పక్కనే ఉన్న నేతలు ఆయనను ఒదార్చేందుకు ప్రయత్నించారు.
కాగా, అయోధ్య జిల్లాకు చెందిన 22 ఏళ్ల దళిత మహిళ జనవరి 30న రాత్రి వేళ భజన కార్యక్రమానికి వెళ్లిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. కాళ్లు విరిచి, కంటి గుడ్లు పీకి, తాళ్లతో కట్టేసిన నగ మతదేహాన్ని శనివారం కాలువలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హింసించి చంపినట్లు అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు ఆ మహిళ మతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం జరిగిందన్నది నిర్ధారిస్తామని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
