మీరట్‌లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురి హత్య

Jan 10,2025 14:48 #gang murder, #Meerut

మీరట్‌ : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు హత్యకు గురయ్యారు. భార్యాభర్తలిద్దరూ.. వారి ముగ్గురి కుమార్తెలు కూడా దారుణంగా హత్యకు గురయ్యారని పోలీసులు వెల్లడించారు, లిసారి గేట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సోహెల్‌ గార్డెన్‌లో ఈ విషాద ఘటన జరిగింది. పోలీసులు ఇంట్లోనే అయిదుగురి మతదేహాలను వెలికితీశారు. భర్త మొయిన్‌, భార్య అస్మా.. మతదేహాలు ఇంటి ఫ్లోర్‌పై ఉన్నాయి. ఇక ముగ్గురు కుమార్తెల మతదేహాలు.. ఓ బెడ్‌లో దాచిపెట్టారు. పిల్లల శవాలను మంచంలో దాచి పెట్టి.. వారి ఆచూకీ తెలియకుండా చేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, ఈ విషయం తెలుసుకున్న ఫోరెన్సిక్‌ బందాలు ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంటిని కార్డెన్‌ చేసి, సాక్ష్యాధారాలను సేకరిస్తున్నారు. క్రైం సీన్‌ను వారు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకేసారి అయిదుగురు కుటుంబసభ్యుల్ని చంపడం వెనుక ఉన్న మిస్టరీని చేధించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో స్థానిక ప్రజలు షాక్‌లోకి వెళ్లారు. మేస్త్రీగా పనిచేస్తున్న మొయిన్‌ కుటుంబాన్ని ఎవరు టార్గెట్‌ చేసి ఉంటారని ఆరా తీస్తున్నారు. మర్డర్‌కు చెందిన ఎటువంటి సమాచారం తెలిసినా… తమతో పంచుకోవాలని పోలీసులు కోరారు.

➡️