న్యూఢిల్లీ : యూట్యూబర్ రణ్వీర్ అల్లబదియాకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. విదేశీ ప్రయాణం నేపథ్యంలో అతని పాస్పోర్ట్ అతనికిచ్చేయాలని సుప్రీంకోర్టు సోమవారం పోలీసుల్ని ఆదేశించింది. జస్టిస్ సూర్యకాంత్, ఎన్ కోటేవ్వర్ సింగ్ నేతత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. పాస్పోర్టు కోసం మహారాష్ట్ర సైబర్ క్రైం బ్యూరోకు వెళ్లాలని కోర్టు ఆదేశించింది. అల్లబదియా తరపున సీనియర్ న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ వాదించారు. ఈ సందర్భంగా అల్లబదియాపై నమోదు అయిన కేసులన్నీ ఒక్కచోటకు చేర్చాలన్న అడ్వకేట్ అభ్యర్థనను స్వీకరిస్తున్నట్లు కోర్టు చెప్పింది.
