శ్రీనగర్ : జమ్మూలో మరోసారి కాల్పులకు పాక్ తెగబడింది. భారత్లోని 26 ప్రదేశాలను లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేస్తోంది. రాజధాని ఢిల్లీ లక్ష్యంగా చేసుకున్న దాయాది పాక్ ఫతాహ్-1. ఫతహ్-2 మిస్సై్ల్స్ను ప్రయోగించింది. అయితే ఆ క్షిపణులు లక్ష్యం చేరకముందే ఇండియన్ ఆర్మీ అడ్డుకుని గాల్లోనే బ్లాస్ట్ చేసింది. పాక్ మిస్సైల్స్ను ఆకాశ్, బరాక్-8 సిస్టమ్స్ సమర్ధవంతంగా అడ్డుకున్నాయి. హర్యానా ప్రాంతంలోని సిర్సాలో పాక్ క్షిపణి కూలినట్లుగా సమాచారం అందుతోంది. జనవాసాలు టార్గెట్గా పాక్ దాడులు చేస్తోంది.