జనావాసాలపై పాక్‌ దాడులు..తిప్పికొట్టిన భారత్‌

  • కరాచి పోర్టుపై దాడి 
  • పాక్‌ ఫైటర్‌ జెట్ల కూల్చివేత
  • ఢిల్లీలో జనసంచారంపై నిషేధం

ఢిల్లీ : ఉరి సెక్టార్‌లో జనావాసాలపై దాడులకు పాకిస్తాన్‌ ప్రయత్నించింది. రాత్రి 12 గంటల ప్రాంతంలో షెల్లింగ్‌లతో చేసిన ఈ దాడిని సైన్యం తిప్పికొట్టింది. అంతకుముందు జమ్మూ, పఠాన్‌కట్‌, ఉధమ్‌పూర్‌, పోఖ్రాన్‌ సైనిక్‌ స్థావరాలు లక్ష్యంగా పాకిస్తాన్‌ దాడులకు దిగింది. ఈ అన్ని పయ్రత్నాలను తిప్పి కొట్టామని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని భారత సైన్యం ప్రకటించింది.మరోవైపు ఈ దాడులకు ప్రతిగా కరాచి పోర్టుతో పాటు, పాకిస్తాన్‌లోని పలు నగరాలపై భారత్‌ దాడులు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నుండి డ్రోన్లు, క్షిపణులతో చేసిన దాడిలో కరాచి పోర్టులో 10 కార్గో నౌకలు దెబ్బతిన్నట్లు కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, రాత్రి 1.30 గంటల వరకు సైన్యం ఈ వార్తలను ధృవీకరించలేదు జమ్మూ కాశ్మీర్‌తో పాటు, రాజస్థాన్‌, పంజాబ్‌లలో పూర్తిస్థాయి బ్లాక్‌అవుట్‌ను అమలు చేస్తున్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్‌16, యుద్ద విమానంతో పాటు, మరో ఫైటర్‌జెట్‌ను సైన్యం కూల్చివేసినట్లు వార్తలు వస్తున్నాయి. 10 పాకిస్తాన్‌ క్షిపణులను కూడా భారత్‌ నేలకూల్చింది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో జనసంచారాన్ని ప్రభుత్వం నిషేధించింది.

➡️