బిజెపి పునాదులు కదిలించిన రైతులు

Jun 4,2024 23:40 #chalo delhi, #Dharna, #Farmer

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఉత్తర భారతదేశంలో బిజెపి పునాదిని కదిలించడంలో రైతుల ఆందోళన కీలకమైంది. 2014, 2019లో బిజెపి గెలుపొందడంలో రైతు ఓట్లు కీలక పాత్ర పోషించాయి. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు చేసిన కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చి 2014లో బిజెపి అధికారంలోకి వచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపి ప్రభుత్వం రైతు సంక్షేమ పథకాలను ప్రకటించింది. 2020లో వాగ్దానాలను వెనక్కి నెట్టి, కార్పొరేట్‌ అనుకూల వ్యవసాయ చట్టాలను అమలు చేయడానికి ప్రయత్నించిన మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన ఆందోళన ఒక సంవత్సరం పాటు కొనసాగింది. కార్మిక సంఘాలు, ఇతర ఉద్యమాలు సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపాయి. అణచివేత విఫలమైన తరువాత, కేంద్రం చట్టాలను ఉపసంహరించు కోవలసి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రైతు వ్యతిరేక విధానాన్ని అనుసరించిన బిజెపి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన దెబ్బకు అద్దం పడుతున్నాయి. ఇవన్నీ నిరంతర రైతు డిమాండ్‌తో దెబ్బతిన్న రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరీలో రైతులను, జర్నలిస్టును కారులో దూకి హత్య చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కేంద్ర మంత్రి అజరు మిశ్రా తేని ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ కేసులో ఆయన కుమారుడు ఆశిష్‌ మిశ్రా నిందితుడు.

➡️