రాజీనామాకు జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ నిరాకరణ

  • రాష్ట్రపతి, ప్రధానికి సిజెఐ లేఖ

న్యూఢిల్లీ : జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ రాజీనామా చేయటానికి నిరాకరించినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. ఢిల్లీలో వర్మ అధికారిక నివాసం నుంచి నగదు రికవరీ విషయంపై రాష్ట్రపతి, ప్రధానమంత్రికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సంజీవ్‌ ఖన్నా లేఖ రాశారు. అప్పటి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, ప్రస్తుత అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్న ముగ్గురు సభ్యుల కమిటీ నివేదిక , జస్టిస్‌ వర్మ స్పందనతో జతచేసింది. ఈ లేఖను ‘ఇన్‌-హౌస్‌ ప్రొసీజర్‌’ కింద పంపారు. కమిటీ నివేదిక ఆధారంగా, జస్టిస్‌ వర్మ రాజీనామా చేయాలని లేదా స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోవాలని సిజెఐ సూచించారని వర్గాలు తెలిపాయి. కానీ జస్టిస్‌ వర్మ దానిని పూర్తిగా తిరస్కరించి, తన పదవిలో కొనసాగాలని నిర్ణయించారు. దీంతో సిజెఐ రాష్ట్రపతి, ప్రధాని మోడీకి లేఖ రాయాల్సి వచ్చిందని న్యాయ నిపుణులు తెలిపారు.

➡️