న్యూఢిల్లీ : ఆపరేషన్ సింధూర్పై వివరాలను తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతి చర్యగా ఆపరేషన్ సిందూర్ పేరిట బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీలకు వివరించనుంది. గురువారం ఉదయం 11.00 గంటలకు పార్లమెంట్ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్రిజిజు బుధవారం ఎక్స్లో పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.
