ఢిల్లీ : సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అంతిమ యాత్ర ఎకెజి భవన్ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర ఎయిమ్స్ వరకు సాగుతుంది. అనంతరం ఆయన కోరుకున్న విధంగా భౌతికకాయాన్ని ఎయిమ్స్కు కుటుంబ సభ్యులు అప్పగిస్తారు. పార్టీ శ్రేణులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు ఈ యాత్రలో పెద్దఎత్తున పాల్గొన్నారు. ‘లాల్ సలామ్ లాల్ సలామ్ కామ్రేడ్ సీతారాం ఏచూరి’ , ‘ఏచూరి అమర్ రహే’ ‘రెడ్ సాల్యూట్ కామ్రేడ్ సీతారాం’ అన్న నినాదాలతో యాత్ర కొనసాగుతున్నది.
కొనసాగుతున్న సీతారాం అంతిమయాత్ర…
కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతదేహాన్ని ఉంచిన అంబులెన్స్ వెనుక వందలాది మందితో పాటు పొలిట్ బ్యూరో సభ్యులు అంతిమయాత్రలో పాల్గొన్నారు.