ప్రయాగ్రాజ్ : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా సందర్భంగా బుధవారం ప్రధాని మోడీ సంగమంలో స్నానం చేశారు. గతంలో ఎన్నికలు జరిగినప్పుడు హిమాలయాలు, ఇతర ప్రసిద్ధ ఆలయాలకు ప్రధాని వెళ్లి.. ఫొటోలను అప్లోడ్ చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నపుడు.. సంగమంలో స్నానం చేయటం కూడా .. హిందూ ఓటర్లను ప్రభావితం చేయటానికేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
