Road accident : జమ్మూకాశ్మీర్‌లో లోయలో పడిన బస్సు

May 6,2025 17:06 #road accident
  • సైనికుడితో సహా నలుగురి మృతి
  • 44 మందికి గాయాలు

జమ్మూ : జమ్మూకాశ్మీర్‌లో ప్రయాణీకులతో వెళతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఒక సైనికుడుతో సహా నలుగురు మరణించారు. ఈ ఘటన ఫూంచ్‌ జిల్లాలోని మెంధర్‌ వద్ద మంగళవారం సంభవించింది. ఈ ప్రమాదంలో 44 మంది గాయడ్డారు. అధికారుల వివరాల ప్రకారం ఘని గ్రామం నుంచి మెంధర్‌ వస్తున బస్సు ఉదయం 9:20 గంటల సమయంలో బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో ఒకస్కారిగా రోడ్డు పక్కన ఉన్న లోయలోకి పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఆర్మీ, సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాలు ప్రారంభించారు. గాయడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతి చెందిన సైనికుడ్ని ఘని గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహ్మద్‌ మజీద్‌గా గుర్తించారు. మజీద్‌ అస్సాంలో విధులు నిర్వహిస్తున్నాడు. సెలువులపై గ్రామానికి వచ్చాడు. గాయపడిన వారు మెంధర్‌, రాజౌరిల్లోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని జమ్మూ గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌ (జిఎంసి)కి తరలించారు.

➡️