న్యూఢిల్లీ : నేడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మరికాసేపట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఈమె బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈమె బడ్జెట్ ప్రవేశపెట్టబోయేముందు రాష్ట్రపతి భవన్కి వెళ్లారు. అనంతరం కేంద్ర కేబినెట్ భేటీ అయ్యింది. ఈ బడ్జెట్ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆ తర్వాత నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకున్నారు. పార్లమెంటు భవనంలోకి ప్రవేశిస్తూ బడ్జెట ట్యాబ్ను ఆమె ప్రదర్శించారు.
