న్యూఢిల్లీ : వచ్చే వెయ్యేళ్ల భవిష్యత్ను రూపొందించేలా తమ ప్రభుత్వ విధానాలను అమలుచేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం తెలిపారు. సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ భారత దేశపు సమగ్రాభివృద్ధి అంటే ఏ గ్రామం, ఏ కుటుంబం, ఏ పౌరుడు వెనుకబడి ఉండకుండా ఉండటం అని తెలిపారు. ప్రస్తుతం భారత దేశ సమాజంలో యువత, రైతులు, మహిళలు గొప్ప లక్ష్యాలను నిర్ధేసించుకుంటున్నారని అన్నారు. అయితే అసాధారణ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి, అసాధారణ వేగం అవసరమని మోడీ తెలిపారు. గత 10 ఏళ్లలో భారతదేశం ప్రభావంతమైన పరివర్తన దిశగా సాగుతోందని మోడీ చెప్పారు. సాంకేతిక యుగంలో పాలన అంటే వ్యవస్థలను నిర్వహించడం కాదని, అవకాశాలను పెంచడం అని మోడీ పేర్కొన్నారు. 2023లో జి20 శిఖరాగ్ర సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించిందని, ప్రపంచం దానిని గుర్తించిందని మోడీ ప్రస్తావించారు. ‘భారతదేశం ఇప్పుడు కేవలం పాల్గనడం లేదు. నాయకత్వం వహిస్తోంది’ అని మోడీ తెలిపారు. పేదల సమస్యలపై సున్నితంగా ఉండాలని, వారి గొంతును వినాలని, వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సివిల్ సర్వీసెస్ అధికారులను మోడీ కోరారు.
