- ‘మిడిల్ ఇంగ్లీష్ స్కూల్స్’గా మార్చిన బిజెపి ప్రభుత్వం
గౌహతి : అస్సాంలోని హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం 1,281 మదర్సాలను మూసివేసి, వాటిని ‘మిడిల్ ఇంగ్లీష్ స్కూల్స్’గా మార్చివేసింది. ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి రనోజ్ పెగు సోషల్ మీడియా ద్వారా గురువారం ప్రకటించారు. రాష్ట్రంలోని విద్యావ్యవస్థలో ఏకరూపత, సమగ్రతను ప్రొత్సహించడానికి ఈ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు తెలిపారు.