Pakistan drone attacks.. జలంధర్‌లో బ్లాక్‌ అవుట్‌ విధింపు

May 10,2025 07:46 #black out, #Indian Army, #Jalandhar, #panjab

జలంధర్‌ : భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడులకు పాల్పడుతోంది. ఈ దాడులను భారత సైన్యం దీటుగా తిప్పికొడుతోంది. పంజాబ్‌లోని జలంధర్‌లో డ్రోన్లు కనిపించటంతో అధికారులు శనివారం బ్లాక్‌ అవుట్‌ విధించారు. అనంతరం భద్రతా బలగాలు ఎక్కడిక్కడ తనిఖీలు చేపట్టారు. ప్రజలు శాంతంగా ఉండి, బ్లాక్‌ అవుట్‌ నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఈ సందర్భంగా సూచించారు. అలాగే గుజరాత్‌లోని పాటణ్‌ జిల్లాలోని సంతల్‌పూర్‌ తాలూకా గ్రామాల్లో బ్లాక్‌ఔట్‌ అమలు చేస్తున్నారు.

➡️