Puducherry : మొదటి కాగిత రహిత అసెంబ్లీ సెషన్‌ ..

పుదుచ్చేరి :   పుదుచ్చేరి సోమవారం మొదటి కాగిత రహిత అసెంబ్లీ సెషన్‌ను నిర్వహించింది. 15వ శాసనసభ 6వ సెషన్‌కి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కె.కైలాసనాథన్‌ అధ్యక్షత వహించారు. మంగళవారం కూడా అసెంబ్లీ సెషన్‌ కొనసాగనుంది. బుధవారం 2025-26 సంవత్సరానికిగాను పుదుచ్చేరి ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి ఎన్‌. రంగసామి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

మొదటి కాగిత రహిత సెషన్‌ కోసం స్పీకర్‌, ముఖ్యమంత్రి సహా మంత్రులందరి సీట్ల ఎదుట పోర్టబుల్‌ కంప్యూటర్‌లను అమర్చారు. సభ్యులు బడ్జెట్‌ నివేదికను చదవడానికి మౌలిక సదుపాయాలు కల్పించారు. వారు అడిగే ప్రశ్నలను కంప్యూటర్‌లో నమోదు చేస్తే, కంప్యూటర్‌ ద్వారానే సమాధానాలు అందించనున్నారు. మంత్రులకు శిక్షణనిచ్చేందుకు కంప్యూటర్‌ శిక్షణ గది, సేవా కేంద్రం, కంప్యూటర్ల నిర్వహణకు కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటయ్యాయి.

ఈ ఏడాది మొదటి సెషన్‌ ఇటీవల గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రంగసామి గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం 5వ సెషన్‌ ఫిబ్రవరి 12న అసెంబ్లీ స్పీకర్‌ ఆర్‌.సెల్వం అధ్యక్షతన జరిగింది. ఈ సెషన్‌లో అదనపు ఖర్చులకు అనుమతి లభించింది. అనంతరం సమావేశం నిరవధికంగా వాయిదా పడింది.

➡️