పాఠశాలలకు సెలవులు
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ను వరసగా మూడో రోజు సోమవారం కూడా భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో సోమవారం అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ విషయాన్ని విద్యా శాఖ మంత్రి సకినా ఇట్టూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, అంచనాల దృష్ట్యా అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించాం’ అని తెలిపారు. శనివారం రాత్రి నుంచి జమ్మూకాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష సంబంధిత కారణాలతో ఇప్పటి వరకూ ఐదుగురు మరణించారు. వందల మంది నిరాశ్రయులయ్యారు. కాగా, రానున్న 24 గంటల్లోనూ జమ్మూకాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
