Red Alert: అమృత్‌సర్‌లో రెడ్ అలర్ట్

పంజాబ్: అమృత్‌సర్‌లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడినప్పటికీ, రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రావద్దని, కిటికీల దగ్గర నిలబడవద్దని అమృత్‌సర్ జిల్లా కలెక్టర్ ఆదివారం ఉదయం 5.24 గంటలకు ఒక ప్రకటన విడుదల చేశారు. సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు అందలేదని, ఎవరూ భయపడవద్దని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. భారతదేశం, పాకిస్తాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకున్నట్లు ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, పాకిస్తాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దులో కాల్పులు జరిపింది. జమ్మూ & కాశ్మీర్‌లోని జమ్మూ, పూంచ్ నగరాల్లో ప్రజలు సాధారణ జీవితానికి తిరిగి రావడం ప్రారంభించారు. సరిహద్దులోకి డ్రోన్లు ప్రవేశించినట్లు, ఈ ప్రదేశాలలో కాల్పులు జరిపినట్లు లేదా షెల్లింగ్ చేసినట్లు ఎటువంటి నివేదికలు లేవు.

➡️