ఢిల్లీ: పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై బుధవారం తెల్లవారుజామున ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్పై దేశీయంగా పలువురి నుండి స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.
- పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద వనరులన్నింటినీ నిర్మూలించడానికి భారతదేశం యొక్క నిబద్ధత రాజీలేనిదిగా ఉండాలని, ఎల్లప్పుడూ అత్యున్నత జాతీయ ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ పేర్కొంది.
- భారత సైన్యానికి తమిళనాడు అండగా నిలుస్తుంది : ఎంకే స్టాలిన్, తమిళనాడు సీఎం
- పహల్గామ్ ఉగ్రవాద దాడిపై ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాలకు వందనం. వారి అసమాన ధైర్యంతో మన దేశం ఉక్కు సంకల్పంతో తనను తాను రక్షించుకుంటుందని వారు మళ్ళీ నిరూపించారు. మన దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడి, మన సాయుధ దళాలకు దృఢంగా మద్దతు ఇస్తుంది : నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ సిఎం
- ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఐక్యంగా ఉంది. భారత సైన్యం యొక్క ధైర్యం మరియు పరాక్రమం పట్ల దేశం మొత్తం గర్విస్తోంది : బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎక్స్ లో పోస్ట్
- ఒక భారతీయ పౌరుడిగా, ముందుగా మన సాయుధ దళాలకు బలంగా అండగా నిలుస్తున్నాం. పాకిస్తాన్ & పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు మనల్ని గర్వపడేలా చేస్తున్నాయి. ఇది జాతీయ సంఘీభావం, ఐక్యతకు సమయం… మనమందరం ఒక్కటిగా నినదిద్దాం. – జై హింద్! – రేవంత్ రెడ్డి, తెలంగాణ సిఎం
- దశాబ్దాలుగా ఓర్పు… సహనం!“ఆపరేషన్ సింధూర్” ద్వారా అఖండ భారతావనిలో మరోసారి ధైర్య స్ఫూర్తిని నింపిన త్రిసేన సాహసోపేతమైన నాయకత్వానికి, వారికి అండగా నిలబడ్డ ప్రధాని మోడీకి హృదయపూర్వక ధన్యవాదాలు…!! మేము ఎల్లప్పుడూ మీతోనే ఉంటాము. జై హింద్!! : పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సిఎం
- పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం “ఆపరేషన్ సింధూర్” పేరుతో ప్రతి దాడులు చేయడం హర్షణీయం. ఇది దేశానికి గర్వకారణం. భారత సైన్యానికి శుభాకాంక్షలు. జై హింద్..జై భారత్ : వైఎస్ షర్మిల
- పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులను స్వాగతిస్తున్నాం. మరో పహల్గామ్ పునరావృతం కాకుండా పాకిస్తాన్ కి కఠినమైన గుణపాఠం నేర్పించాలి : అసదుద్దీన్ ఒవైసీ