పాలక్కాడ్ : కేరళ ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి ప్రీమియం లేని కోటి రూపాయిల బీమా పథకాన్ని కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రకటించింది. విధి నిర్వహణలో లేదా విధుల్లో లేనప్పుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.1 కోటి బీమా ప్రకటించారు. డ్రైవర్లు, కండక్టర్లు, మినిస్టీరియల్ మరియు లైన్ అధికారులు మెకానికల్ ఉద్యోగులు ఈ బీమాను పొందుతారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు అయితే వారికి రూ.80 లక్షలు అందుతాయి. అదనంగా, పిల్లల విద్య, బాలికల విద్య కోసం ఒక్కొక్కరికి రూ.10 లక్షలు అందించబడతాయి. ప్లాస్టిక్ సర్జరీ, కాలిన గాయాల చికిత్స, ఎయిర్ అంబులెన్స్ సౌకర్యాలు వంటి అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ఎస్బీఐ సహకారంతో ఈ పథకం అమలు చేయబడుతుంది. ఇది జూన్లో అమలులోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం కేరళ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులకు గురి చేస్తున్నా ఎల్డీఎఫ్ ప్రభుత్వం తనదైన శైలిలో ప్రజానుకూల విధానాలను అమలు చేస్తుంది.
