న్యూఢిల్లీ : ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమైన గంటల వ్యవధిలోనే సౌదీ అరేబియా, ఇరాన్ మంత్రులు ఢిల్లీకి రావడం, విదేశాంగ మంత్రి జైశంకర్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం రాత్రే ఢిల్లీ చేరుకున్న సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్-జుబేదర్ గురువారం ఉదయం జైశంకర్తో భేటీయ్యారు. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారత్ దృక్కోణాన్ని జుబేదర్కు వివరించినట్లు జైశంకర్ ఎక్స్లో పోస్టు చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్సాస్ అరఘ్చి కూడా జైశంకర్తో గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు సమావేశమయ్యారు.
