- అడవులపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది
- మోడీ విమర్శలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, అడవులపై బుల్డోజర్ను ప్రయోగించడంలో నిమగమైందని ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ప్రకృతిని నాశనం చేయడం, జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యశైలీ అని ఆరోపలు గుప్పించారు. హర్యానాలో చెత్త నుండి గోవర్థన్ గిరీ తయారు చేసేందుకు కృషి చేస్తుంటే, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ అడవిని నాశనం చేస్తోందన్నారు. సోమవారం హర్యానాలోని హిసార్ ఎయిర్ పోర్ట్, ఇతర ప్రాజెక్ట్ లను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం యమునా నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో అక్కడి ప్రభుత్వాలు ప్రజల విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నాయన్నారు. కర్ణాటకలో ఏకంగా అవినీతిలో కర్ణాటకను దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపారు’ అని ఆరోపించారు. బిజెపి కేవలం సత్యం ఆధారంగానే పాలన చేస్తోందన్నారు. అంబేడ్కర్ సూచించిన దిశలో పరిపాలిస్తున్నట్లు వెల్లడించారు. రాజ్యాంగ గౌరవాన్ని పెంపొందించేలా ముందుకు వెళ్తోందన్నారు. వికసిత్ భారత్ చేసే కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోన్నట్లు చెప్పారు.