తిరువనంతపురం : కేరళలో అనుమానిత నిపా కేసు నమోదైనట్లు అధికారులు గురువారం తెలిపారు. మలప్పురం జిల్లాలోని వాలంచెరికి చెందిన 42ఏళ్ల మహిళ అనారోగ్యంతో పెరింతల్మన్న ఆస్పత్రిలో చేరింది. ఆమెకు నిపా వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి. జ్వరం, మూర్ఛ వంటి సాధారణ లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్లు పేర్కొన్నాయి. నమూనాలను రాష్ట్ర మరియు జాతీయ వైరాలజీకి పంపినట్లు వెల్లడించాయి. ఈ అనుమానిత కేసుతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
