బీహార్‌లో పడవ బోల్తా పడి ముగ్గురు మృతి

Jan 20,2025 10:46 #bhihar, #Bihar, #Boat accident

పాట్నా: బీహార్‌లో పడవ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఆదివారం బీహార్‌లోని కత్యార్‌లో ఈ ప్రమాదం జరిగింది. 15 మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. 7 మందిని రక్షించారు. మృతుల్లో 3 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. ప్రమాదానికి కారణం అస్పష్టంగా ఉంది.

➡️