‘మాకు ఉద్యోగాలివ్వండి’.. సీఎం రేవంత్‌కు డీఎస్సీ 2008 బాధితులు విజ్ఞప్తి

Mar 5,2024 14:54 #Dharna, #dsc candidates

హైదరాబాద్‌ : డీఎస్సీ 2008 బాధితులు ప్రజా భవన్‌కు భారీగా తరలివచ్చారు. తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి సుమారు 300 మందికి పైగా అభ్యర్థులు తరలివచ్చారు.తమకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, గతంలో సీఎం రేవంత్‌ రెడ్డి కూడా తమకు హామీ ఇచ్చారని బాధితులు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగు నింపిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. డీఎస్సీ 2008కి చెందిన వెయ్యి మంది బాధితుల 15 ఏళ్ల కన్నీళ్లను తుడవాలని అభ్యర్థులు కోరారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌ తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు విన్నవించారు.

➡️