విఐపిల కోసం 10 బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలు

Feb 12,2025 09:01 #AP Govt

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విఐపిల భద్రతకు 10 బుల్లెట్‌ ఫ్రూప్‌ (టొయోటా ఫార్చ్యూనర్‌) వాహనాలను ఇంటెలిజెన్స్‌ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఈ మేరకు జిఓ ఆర్‌టి నెంబరు 255ను మంగళవారం విడుదల చేసింది. ఒక్కో వాహనం ఖరీదు రూ.9 కోట్ల 20 లక్షలుగా ప్రభుత్వం పేర్కొంది.

➡️