కాశ్మీర్‌ నుంచి ఎపి భవన్‌కు 41 మంది విద్యార్థులు

May 11,2025 00:23 #AP Bhavan

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కాశ్మీర్‌లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 41 మంది విద్యార్థులు ఢిల్లీలోని ఎపి భవన్‌కు చేరుకున్నారు. వారు తమ స్వస్థలాలకు చేర్చేందుకు ఎపి భవన్‌ చర్యలు చేపడుతుంది. కాశ్మీర్‌ నుంచి విద్యార్థులు వచ్చేందుకు కూడా ఏపి భవన్‌ అధికారులే అన్ని రకాల సహయసహకారాలు అందించారు. 41 మంది విద్యార్థుల్లో ఐదుగురు విద్యార్థులు ఇప్పటికే ఢిల్లీ నుంచి ఎపిలోని తమ స్వస్థలాలకు బయలుదేరారు. మిగిలిన విద్యార్థులకు ఎపి భవన్‌ వసతి, భోజనం, రవాణా సదుపాయాలను కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సౌకర్యార్థం ఏపి భవన్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. సంబంధిత సమాచారం, సహాయం కోసం 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించాలని అధికారులు కోరారు. ఫోన్‌ నెంబర్‌ 011-23387089, మొబైల్‌ నెంబర్లు 9871999430, 9871999053 సంప్రదించాలని సూచించింది. అదనపు సమాచారం కోసం డిప్యూటీ కమిషనర్‌ ఎం.వి.ఎస్‌ రామారావు (9871990081), లైజన్‌ ఆఫీసర్‌ వి.సురేష్‌ బాబు (9818395787) సంప్రదించవచ్చని ఎపి భవన్‌ తెలిపింది.

➡️