22 ఏండ్ల అమ్మాయిని 42 ఏండ్ల వ్యక్తికిచ్చి వివాహం చేయబోతుండగా…

తుని (కాకినాడ) : 22 ఏండ్ల అమ్మాయిని 42 ఏండ్ల వ్యక్తికిచ్చి వివాహం చేసే ప్రయత్నాన్ని అక్కడి ప్రజలు అడ్డుకున్న ఘటన శనివారం జరిగింది. కాకినాడ జిల్లాలోని అన్నవరం ఆలయ ప్రాంగణంలో 22 ఏళ్ల యువతికి 42 ఏళ్ల వ్యక్తితో వివాహానికి ఏర్పాట్లు చేశారు. పెళ్లి పీటలపై ఏడుస్తున్న యువతిని అక్కడి ప్రజలు, భద్రతా సిబ్బంది గుర్తించారు. తనకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నారని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విచారణ కొనసాగుతోంది.

➡️