బ స్సులోనే ప్రసవం.. మానవత్వం చాటుకున్న మహిళా కండక్టర్‌

Jul 5,2024 13:05 #bus, #gave birth, #woman conductor

హైదారాబాద్‌: ఆర్టీసీ బ స్సులో పురిటి నొప్పులతో బాధాపడుతున్న ఓ గర్భిణికి ఆర్టీసీ కండక్టర్‌ పురుడు పోసి మానవత్వం చాటుకున్నారు. ముషీరాబాద్‌ డిపోనకు చెందిన 1 జెడ్‌ రూట్‌ బ స్సులో శుక్రవారం ఉదయం శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆరాంఘర్‌ లో ఎక్కారు. బ హదూర్‌ పూర వద్దకు రాగానే ఆమెకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన కండక్టర్‌ ఆర్‌. సరోజ అప్రమత్తమై మహిళా ప్రయాణికుల సాయంతో సాధారణ ప్రసవం చేశారు. ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీపంలోని గవర్నమెంట్‌ మెటర్నటీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారు. బ స్సులోనే కాన్పు చేసి మానవత్వం చాటుకున్న కండక్టర్‌ సరోజతో పాటు సహా మహిళా ప్రయాణికులను టిజిఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ అభినందనలు తెలియజేశారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు సేవా స్ఫూర్తిని ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం ప్రశంసనీయమని అన్నారు.

➡️