- 28 మందికి స్థానచలనం
- వెయిటింగ్లోని 17 మందికి పోస్టింగ్
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున డిఎస్పిలను బదిలీ చేసింది. పలు కారణాలతో వెయిటింగ్లో గత కొంత కాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న 17 మంది, మరో 11 మంది రెగ్యులర్ డిఎస్పిలకు పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే బదిలీ అయిన ప్రదేశంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.