వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు ఆశా వర్కర్లు సహా ఏడుగురు మృతి
ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్రంలో శనివారం రోడ్లు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్ర్రమాదాల్లో ఇద్దరు ఆశా వర్కర్ల సహా ఏడుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం… కృష్ణా జిల్లా మచిలీపట్నం రైల్వే స్టేషన్ సమీపంలోని శుభం కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గనేందుకు వివిధ గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లు ఆటోలో బయలుదేరారు. తరకటూరు వద్ద వారి ఆటోను కారు వెనుక నుండి బలంగా ఢకొీంది. దీంతో, ఆటో అదుపు తప్పి రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆశా వర్కర్లు పమిడిముక్కల మండలం గోపువానిపాలెం గ్రామానికి చెందిన తాడేపల్లి విజయలక్ష్మి (45), తాడంకి గ్రామానికి చెందిన ఊటుకూరి దుర్గ (40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.
టైల్స్ లోడ్తో గుంటూరు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న టిప్పరును తప్పించబోయి అదుపుతప్పి బాపట్ల జిల్లా పర్చూరు మండల పరిధిలోని తిమ్మరాజుపాలెం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై బోల్తా పడింది. లారీపై కూర్చొన్న ముగ్గురు కార్మికులపై టైల్స్ పడ్డారు. దీంతో, పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన తమ్ములూరి సురేంద్ర బాబు (30), మార్టూరుకు చెందిన తాళ్లూరి ప్రభుదాస్ (27), పాలపర్తి శ్రీను (28) మృతి చెందారు.
శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి అవుటర్ రింగ్ రోడ్ వై.జంక్షన్ సమీపంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ కారులోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన రాజశేఖర్రెడ్డి (45), ఆయన కుమారుడు యస్విత్రెడ్డి (7) మృతి చెందారు. ఎనిమిది మంది గాయపడ్డారు. కళ్యాణదుర్గానికి చెందిన మూడు కుటుంబాలు కలిసి ఒకే కారులో తిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
